భారత్ -పాక్ సరిహద్దుల్లో కాల్పులు
భారత్ -పాక్ సరిహద్దుల్లో దాయాది దేశ సైన్యం రెచ్చిపోయింది. జమ్ముకశ్మీర్లోని పూంఛ్ సెక్టార్ లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. గుల్పురా ఏరియాలోని నియంత్రణ రేఖ దగ్గర ఈ ఉదయం నుంచి పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో భార్యాభర్తలు మృతిచెందారు. వారి చిన్నారులు గాయాలపాలయ్యారు. మృతిచెందిన వ్యక్తి భారత జవాను అని సమాచారం.
పాక్ కాల్పుల నేపథ్యంలో భారత భద్రతాసిబ్బంది అలెర్ట్ అయ్యారు. ఎదురుకాల్పులు చేపట్టి పాక్ సైన్యానికి దీటుగా సమాధానం ఇచ్చారు.ఇదిలాఉంటే బాందిపొరాలో జిల్లాలో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. హాజిన్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్విహిస్తున్న బలగాలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.