లిక్కర్ కింగ్ ఆస్తుల విక్రయానికి బ్యాంకుల నిర్ణయం..
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. ఈ- వేలం ద్వారా పలు ఆస్తులను బ్యాంకులు వేలం వేసేందుకు సిద్ధమవుతున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చకుండా మాల్యా ఎగనామం పెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయన దేశం విడిచి వెళ్ళిన విషయం కూడా తెలిసిందే. దీంతో మాల్యాకు చెందిన ఆస్తుల విక్రయానికి బ్యాంకులు రంగం సిద్ధం చేసుకున్నాయి. ముంబైలోని కింగ్ ఫిషర్ హౌస్ సహా పలు ఆస్తులను బ్యాంకులు ఈ-వేలం ద్వారా విక్రయిస్తున్నాయి. ఆంథేరిలోని 2,401.70 చదరపు మీటర్లు ఉన్న భవనానికి రూ. 150 కోట్లు రిజర్వు రేటుగా నిర్ణయించారు.
మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్.. బ్యాంకుల నుంచి రూ. 7వేల కోట్ల మేర రుణాలు తీసుకుని తీర్చలేదు. ఆ సంస్థ నష్టాలపాలై మూతపడింది. దీంతో గత ఏడాది కింగ్ఫిషర్ భవనాన్ని ఎస్బీఐ స్వాధీనం చేసుకుంది. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్న విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్ళారు. దీంతో ఆయన ఆస్తులను విక్రయించాలని బ్యాంకులు నిర్ణయించాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.