త్వరలో పుల్లెల గోపీచంద్ బయోపిక్..!
రియో ఒలింపిక్స్ లో జరిగిన గోల్డ్ ఫైట్ లో ఓడినా పీవీ సింధు పోరాట పటిమ దేశ ప్రజల మన్ననలు పొందింది. ఈ క్రీడాకారిని భారత్ కు రజతం సాధించి పెట్టింది.ప్రస్తుతం భారత్ లో సింధు పేరు మార్మోగుతోంది. ఈమెను ఆ రేంజ్ లో సానబెట్టిన గురువు పుల్లెల గోపీచంద్. ఆయన గురించి కూడా దేశ్యవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుందామనుకున్నాడో నిర్మాత. గోపీచంద్ లైఫ్ హిస్టరీ ఆధారంగా బయోపిక్ నిర్మించేందుకు నిర్మాత నామా అభిషేక్ సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగు, హిందీ భాషల్లో నిర్మించనున్న ఈ మూవీకి టైటిల్గా ‘పుల్లెల గోపిచంద్’ అని పెట్టారు. గోపీచంద్ జీవితం సినిమా కథకు సరిగ్గా సరిపోతుందని ఆయన భావిస్తున్నారట. అత్యున్నత స్థాయికి రావడానికి ఆయన చేసిన పోరాటం .. ప్రేమ వివాహం, గాయాలు.. అన్నింటిని నుంచి తేరుకుని భారత బ్యాండ్మింటన్ రంగానికే కొత్త అర్ధం చెప్పాడని నామా అన్నారు. ఈ అంశాలతో సినిమాను తెరకెక్కించనున్నామని తెలిపారు. నవంబర్లో సెట్స్ పైకి ఈ చిత్రాన్ని తీసుకెళ్ళనున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను హైదరాబాద్, బెంగళూరు, బర్మింగ్హామ్లలో చిత్రీకరించనున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.