అక్టోబర్ నుంచి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తా: పవన్ కల్యాణ్
తాను ఇప్పటివరకు కొన్ని సార్లు మాత్రమే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. వచ్చే అక్టోబర్ నుంచి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని అన్నారు. తాను అన్ని రకాల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. జనసేన పార్టీ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సదస్సులు పూర్తి చేశామన్నారు. అయితే ఇంకా చేయాల్సింది చాలానే ఉందన్నారు.
వచ్చే రోజుల్లో తాను పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలపై పనిచేస్తానన్నారు. తన చేతిలో ఉన్న సినిమాలు కూడా పూర్తికావచ్చాయని చెప్పారు. త్వరలో రెండు మూడు వంతుల భాగాన్ని రాజకీయాల కోసమే కేటాయిస్తానని చెప్పారు.తనకు పాదయాత్ర చేయాలని ఉందన్నారు. వాస్తవానికి 2014లోనే చేద్దామని అనుకున్నానని చెప్పారు. కాకాపోతే తాను జనంలోకి వెళ్తే కదలనివ్వరేమోననే భయం ఉందన్నారు. అలాగే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందేమోనని ఆలోచిస్తున్నానని చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.