పంజాగుట్ట పోలీస్స్టేషన్ సందర్శించిన గవర్నర్ దంపతులు..!
తెలంగాణలో పోలీస్స్టేషన్ అంటే ఇలా ఉంటుందా… కార్పొరేట్ కార్యాలయానికి ధీటుగా ఉంది. ఏ విభాగం ఎక్కడ ఉండాలో అక్కడుంది. ఎవరి విధులు ఏమిటో స్పష్టంగా ఉంది. ఇదీ మోడల్ పోలీస్స్టేషన్.. ఇలాంటి ఇన్నోవేటివ్ పోలీ్సస్టేషన్ ఎక్కడా లేదు. ఈ నేపథ్యంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన పంజాగుట్ట పోలీస్స్టేషన్, హైదరాబాద్ పోలీసింగ్పై ఈ సదస్సులో కేంద్ర హోంమంత్రి ప్రత్యేకంగా ఆరా తీశారు.
తెలంగాణ పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ, ఠాణాల్లోని సౌకర్యాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఆయా రాష్ర్టాలు పంజాగుట్ట ఠాణాను స్ఫూర్తిగా తీసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. తాజాగా నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను గవర్నర్ నరసింహన్ దంపతులు నేడు సందర్శించారు. ఇటీవలే కేంద్ర హోంమంత్రి నుంచి పంజాగుట్ట పోలీసులు అవార్డు అందుకున్నారు. పీఎస్ను సందర్శించిన గవర్నర్ పౌరసేవలు, సౌకర్యాలు, నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.