టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న గుత్తా..వివేక్
చాలా రోజులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్లు టీఆర్ఎస్లో చేరుతున్నారని వస్తున్న ఊహాగానాలకు వారు తెరదించారు. కాంగ్రెస్ పార్టీలోని అంతఃకలహాలతో తాము మనో వేదనకు గురయ్యామని, కాంగ్రెస్ పార్టీని వీడుతున్నకు బాధగా ఉన్నా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. కాంగ్రెస్ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించానని, తనకు రెండు సార్లు ఎంపీగా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడానికి తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతునిస్తామని, ఈనెల 15న టీఆర్ఎస్లోకి చేరుతున్నామని ఆయన ప్రకటించారు. కేసీఆర్ పిలుపు మేరకే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఆయన చెప్పారు.
కాగా ఈ నెల 15వ తేదీన గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్తో పాటు, మాజీ మంత్రి వినోద్, మిర్యాలగూడకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కరరావు… కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందినే నేత జువ్వాడి నరసింగరావు కూడా టీఆరెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. జువ్వాడి తండ్రి రత్నాకరరావు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉంటున్న కుటుంబానికి చెందిన జువ్వాడి నరసింగరావు టీఆరెస్ లో చేరబోతుండడంతో ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కానుందని ప్రజలు భావిస్తున్నారు. అయితే వీళ్ల చేరిక కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బే అని చెప్పవచ్చు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.