ట్రంప్ ప్రచారం భయం ఆధారంగా సాగుతోంది: హిల్లరీ క్లింటన్
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థను ఓబామా, హిల్లరీలే స్థాపించారని అమెరికా అధ్యక్షబరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలను హిల్లరీ క్లింటన్ తిప్పికొట్టారు. భయాన్నే ట్రంప్ అస్త్రంగా చేసుకున్నారని.. భయంతో వణికిపోతున్నారని విమర్శించారు. అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ ఏమాత్రం పనికిరారని అన్నారు. ఐఎస్ఐఎస్ వ్యవస్థాపకుడు ఒబామా, సహా వ్యవస్థాపకరాలు హిల్లరీ అంటూ ట్రంప్ ఫ్లోరిడాలో వ్యాఖ్యానించారు. ఇద్దరూ పశ్చిమాసియాలో ఉగ్రవాదానికి తోడ్పడ్డారంటూ ఆరోపించారు. ఇరాక్ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
దీంతో ట్రంప్ వ్యాఖ్యలపై హిల్లరీ మండిపడ్డారు. భయాన్నే ఆయన ఆయుధంగా చేసుకున్నారంటూ మిషిగాన్లో విమర్శలు గుప్పించారు. అమెరికాను వాణిజ్యరంగంలో పరుగులు పెట్టిస్తానంటున్నారని ఎద్దేవ చేశారు. ట్రంప్ ప్రచారం అంతా భయం ఆధారంగానే సాగుతోందన్నారు. భయం కారణంగా ప్రపంచంతో అమెరికా పోరాడలేదన్నారు. ప్రతి దానికి భయపడితే అమెరికా వెనుకబడిపోతుందన్నారు. ట్రంప్ లాగే అమెరికన్లు అందరూ భయపడిపోతే ఇళ్ళలో దాక్కోవాల్సిందేనని అన్నారు. ఆర్థిక వ్యవస్థ, విదేశీ వాణిజ్యంపై ట్రంప్కు ఏమాత్రం అవగాహన లేదని హిల్లరీ ఆరోపించారు. ఆయన విధానాలను సొంత పార్టీయే అంగీకరించడం లేదన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.