మళ్లీ వేడెక్కిన నెల్లూరు రాజకీయాలు..
నెల్లూరు జిల్లా రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి వర్సెస్ టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య పోరు మరోసారు ప్రారంభమైంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరోసారి మొదలైంది. తప్పు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీనిపై ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోమన్ రెడ్డి స్పందించారు. ఇకనైనా మాట మీద నిలబడాలని సూచించారు.
అంతేకాదు కాకాణి గోవర్దన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకాణి నెల్లూరు జిల్లాలో ఎకరాలకు ఎకరాలు భూ కబ్జాలు చేశారని ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వ్యక్తి తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో వీరిద్దరి మధ్య విమర్శ, ప్రతివిమర్శలు పీక్ స్టేజ్ కి చేరిన విషయం తెలిసిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.