యూపీలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాలు..
భారత ప్రధాని వారణాసిలో పర్యటించారు. శనివారం ఉదయం ఆయన వారణాసిలో జరిగిన రోడ్ షో లో పాల్గొన్నారు. మరోవైపు.. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా రోడ్ షో లో పాల్గొన్నారు. ఇక రోడ్ సందర్భంగా ఎస్పీ, కాంగ్రెస్ కు చెందిన పలువురు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కచెహ్రి చౌరాహా దగ్గర ప్రారంభమైన రోడ్షో గిర్జాఘర్ చౌరహా వరకు సాగింది.రోడ్ షో నదేసర్, చౌక్ఘాట్, దోషిపుర, గోల్గంజ్, పీలి కోథి, మైదాగిన్ ఏరియాల మీదుగా సుమారుగా పది కి.మీ మేర సాగింది. ఈ రోడ్ షో లో ఇరు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఇక వారణాసిలో నిర్వహించిన ర్యాలీని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యూపీలో చివరి దశ పోలింగ్ మార్చి 8న జరగనుంది. అటు మోదీ ఇటు అఖిలేష్, రాహుల్ ప్రచారాలు చేయడంతో ఒక్కసారిగా యూపీలో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.