తనకేపాపం తెలియదంటున్న బాబు
ఏపీ సంబంధించిన ప్రత్యేక హోదా విషయంలోకానీ.. తెలంగాణ సర్కార్ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో కానీ.. కేంద్రం ఇవ్వాల్సిన నిధుల విషయంలో కానీ.. తనకేపాపం తెలియదంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మొన్నటి వరకు రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెడతామని.. అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని, పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన బాబు ఇప్పుడు అవన్నీ కూడా ఇతరులపై తోసేస్తున్నాడు. రాష్ట్ర విభన చేయమని లేఖ ఇచ్చిన విషయాన్ని మరిచిపోయిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందని.. అందుకే ఇప్పుడు ఈ కష్టాలు అంటూ విమర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రం అని, ఒకవేళ ఇవ్వకపోతే తనకేం సంబంధం అంటూ చిర్రుబుర్రులాడుతున్నారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఈ మాటలు చెబుతూనే ప్రత్యేక హోదాను సాధించే విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు.
ప్ర్యతేక హోదా అంశంపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. హోదా తేవడమంటే ఇంట్లో కూర్చొని దొంగ లెక్కలు రాసుకున్నంత సులభం కాదని చంద్రబాబు అంటుండడం గమనార్హం. పేరు ఏదనే దానితో సంబంధం లేకుండా రాష్ట్రం అభివృధ్ధి చెందేంత వరకు చేయూతనివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనంటున్నారు. కాంగ్రెస్ చేసిన నిర్వాకం వల్లే ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తోందని విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంపై బాబు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ కు ఇక ఎప్పటికీ అవతరణ దినోత్సవం ఉండదంటున్నారు. దానికి బదులుగా ప్రతిసంవత్సరం నవ నిర్మాణ దీక్షలే ఉంటాయని చెప్పడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.