ర్యాలీలో నేనూ పాల్గొంటా: జగన్
ప్రత్యేక హోదా కోరుతూ విశాఖలో గురువారం సాయంత్రం నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో తాను కూడా పాల్గొంటానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కొవ్వొత్తుల ర్యాలీలో యువత పాల్గొనకుండా చంద్రబాబు సర్కారు ఆంక్షలు విధిస్తోందన్నారు. తాను కూడా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటానని అన్నారు. తనను అరెస్టు చేస్తారా.. లేకపోతే ఏం చేస్తారో మీ ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు.తాము చాలా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. దయచేసి ప్రభుత్వం తమకు ఆటంకం కలిగించవద్దని కోరారు. చంద్రబాబు కూడా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనాలని సూచించారు.
అలాగే ప్రతి జిల్లా కేంద్రంలోనూ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు యువత ముందుకొస్తోందన్నారు. అయితే ర్యాలీ నిర్వహించవద్దంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని మండిపడ్డారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకపోయినా సెక్షన్ 30, సెక్షన్ 144 అమల్లో ఉందని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. చంద్రబాబు ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని మండిపడ్డారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.