స్టార్ క్యాంపెయిర్ గా మారుతున్న యూపీ సీఎం
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు మంచి చేరువ అవుతున్నారు. యోగి తీసుకునే సంచలన నిర్ణయాలతో స్వపక్ష నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. అంతేకాదు ఎంత పెద్ద ప్రభుత్వ అధికారైనా తప్పు చేస్తే కఠినమైన శిక్ష వేస్తూ వారకి ముచ్చెమటలు పట్టేలా చేస్తున్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ బీజేపీ తరుపు నుంచి ఆ మద్య గుజరాత్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించి గెలుపు కోసం కృషి చేశారు.
ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఓ ఆశాకిరణంగా, ప్రచార తురుపుముక్కగా మారిపోయారు. తమ రాష్ట్రంలో యోగితో ప్రచారం చేయించుకోవాలని బీజేపీ సీఎంలు కోరుకుంటున్నారు. దీంతో యోగి ఇప్పుడొక స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. కేరళలో ఎర్ర సైన్యానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారంలోనూ యోగి పాత్ర ఉంది. త్వరలోనే జరగనున్న ఉత్తరాది రాష్ట్రాలు, ఆ తర్వాత జరిగే కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లోనూ యోగి కీలక పాత్ర పోషించనున్నారు. ఎన్నికలు జరిగే ఈశాన్య రాష్ట్రం త్రిపురలో రెండు రోజుల పాటు యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొననున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.