భారత్ – చైనా సఖ్యతగా ఉండాలి: దలైలామా
రెండు నెలలుగా భారత్-డోక్లాం మధ్య వివాదం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు ఓ దేశాన్ని మరో దేశం ఓడించుకోలేవని అన్నారు. భారత్, చైనాలు పొరుగు దేశాలు కాబట్టి రెండూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ‘హిందీ చీనీ భాయి భాయి’ ఉద్దేశం అదేనని చెప్పారు.
ఆయన ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలపై ఆయన స్పందించారు. ‘ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్, చైనా.. ఒకదేశాన్ని ఇంకో దేశం ఓడించలేదు. ఎందుకంటే ఇరు దేశాలు సైనిక సంపత్తిలో చాలా శక్తిమంతమైనవి. అందువల్ల పొరుగుదేశాలు అయిన ఈ రెండు దేశాలు కలిసిమెలిసి ఉండాలి’ అని అన్నారు. ‘హిందీ, చీనీ భాయి భాయి’గా మళ్లీ ఇరు దేశాలు సఖ్యతగా ఉండాలి’ అని దలైలామా అభిప్రాయపడ్డారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.