పాక్ మై కమిషనర్ పై భారత్ ఆగ్రహం..
న్యూఢిల్లీలో జరిగిన పాకిస్థాన్ డే కార్యక్రమంలో పాక్ మిషనర్ అబ్దుల్ బాసిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్ పై విరుచుకుపడ్డారు.తన మాటల సందర్భంలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఈ మేరకు ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ వాసుల ఆకాంక్షలను ప్రతిబింబించేలా సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని అన్నారు. ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందన్నారు.
కశ్మీర్ వేర్పాటువాదులు స్వాతంత్య్రం కోసమే పోరాటం చేస్తున్నారని అన్నారు. భగవంతుడి దయ వల్ల కశ్మీరీలు చేస్తోన్న పోరాట ఫలితం త్వరలోనే వస్తుందన్నారు. ఆయన వ్యాఖ్యలపై భారత విదేశాంత శాఖ మండిపడింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్డమేంటని ప్రశ్నించింది. వారి దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడంపై దృష్టిపెట్టాలని హితవు పలికింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.