భారత్ జవాన్ కు పాక్ నుంచి బెదిరింపులు..
‘సింహం ఎవరికీ భయపడదు.. ఈ విషయాన్ని పాకిస్థాన్కు తెలియజేయండి.. భవిష్యత్ లో కశ్మీర్ ఉంటుంది.. కానీ పాకిస్థాన్ మాత్రం ఉండదు’ అంటూ భారత్ కు చెందిన ఓ సైనికుడు హెచ్చరించాడు. ఇది జరిగి చాలా రోజులు అయింది. ఈ హెచ్చరికలు చేసింది భారత సైనికుడు మనోజ్ ఠాకూర్. యూరీ ఉగ్రదాడిలో భారత్ 19 మంది సైనికులను కోల్పోయింది. దీంతో సైనికుల్లో కోపం తారాస్థాయికి చేరుకుంది. వారి రక్తం మరిగిపోయి ఉరకలెత్తింది. అంతేకాదు.. ప్రతీకారం తీర్చుకోవాలని సైన్యం భావించింది.
ఇక తమతోటి సైనికులు ఇకలేరు అన్న విషయాన్ని తట్టుకోలేక మనోజ్ ఠాకూర్ పాక్ ను ఓ గీతం ఆలపిస్తూ హెచ్చరించాడు. ఓ బస్సులో వెళ్తున్న జవాన్ల బృందంలో మనోజ్ ఉన్నారు. ఆయన తీవ్రమైన ఉద్వేగానికి లోనై పాకిస్థాన్ తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ జవాన్ కు బెదిరింపులు వస్తున్నాయి. ఆయన్ను చంపేస్తామంటూ పాక్ నుంచి ఎక్కువగా బెదిరింపులు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన తోటి సైనికులు వెల్లడించారు. సోషల్ మీడియాలో వారు ఈ విషయాన్ని పేర్కొన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.