బ్రిటన్ పార్లమెంటు దగ్గర ఉగ్రదాడి మా పనే.. ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్..
బ్రిటన్ పార్లమెంటు బయట జరిగిన దాడి తామే చేశామంటూ ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు ప్రకటించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లుగా అమక్ మీడియా అనే ఏజెన్సీ తెలిపింది.పార్లమెంటు సమీపంలోని స్థానికులు, భద్రతా సిబ్బందిని టార్గెట్ గా చేసుకొని ఈ దాడికి పాల్పడినట్లు ఓ ప్రకటనలో ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇదిలాఉంటే ఉగ్రదాడితో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న 8 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పలు కోణాల్లో విచారిస్తున్నారు.
బ్రిటన్ పార్లమెంట్ సమీపంలో ఓ బ్రిడ్జ్ ఉంది. అక్కడ ఓ ఉగ్రవాది కారును వేగంగా అక్కడ నడుస్తున్న వారిపైకి పోనిచ్చాడు. దీంతోబ్రిడ్జిపై ఉన్న పాదచారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఇక కారులో ఉన్న ఉగ్రవాదిపైకి పోలీసులు తక్షణం కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడని తెలుస్తోంది. ఈ ఘటనలో ఏకంగా 40 మందికి గాయాలు అయ్యాయి. దాడి సమయంలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే సహా పలువురు ఎంపీలు పార్లమెంటులోనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది కాసేపు పార్లమెంటును మూసి వేశారు. ప్రధాని థెరిసా మే బాగానే ఉన్నారని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.