మళ్ళీ జగన్ సంతకం పెట్టలేదు: మంత్రి యనమల
నోటీసులు ఇవ్వడం వెనక్కి పారిపోవడం జగన్ కి అలవాటుగా మారిందని మంత్రి యనమల విమర్శించారు. రోజూ స్పీకర్ పై నిందలు వేయడం సబబు కాదన్నారు. ప్రజాస్వామ్యం వైసీపీ వారి దగ్గర ఉందో లేదో తమకు తెలీయదన్నారు. అయితే.. తమ దగ్గర మాత్రం ఉందన్నారు. ఎమ్మెల్యేలను రక్షించుకోవాల్సిన అవసరం తమకు లేదని తేల్చిచెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలకే తమ అధినేతపై నమ్మకంలేదని ఎద్దేవ చేశారు. ఇవాళ స్పీకర్ పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై జగన్ ఎందుకు సంతకం పెట్టలేదో తెలియాజేయాలని ప్రశ్నించారు.అలాగే.. సోమవారం ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస నోటీసుపైనా జగన్ సంతకం పెట్టలేదని యనమల వెల్లడించారు.
అవిశ్వాస నోటీసు ఇచ్చిన తర్వాత.. కనీసం 14 రోజుల తర్వాతే చర్చ చేపట్టాలని నిబంధనల్లో ఉన్నట్లు వైసీపీ అధినేత జగన్ అన్నారు. సభ్యులకు విప్ జారీ చేసేందుకు సమయం కోసమే 14రోజుల సమయం ఉందన్నారు. తమ పార్టీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలను రక్షించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.