చంద్రబాబుకు జగన్ బహిరంగ లేఖ..
బాబు వస్తే జాబు వస్తుందని అని ప్రచారంలో హామీ ఇచ్చారని వైఎస్ జగన్ అన్నారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని అన్నారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాశారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, కోన రఘుపతి పార్టీ ఆఫీసులో ఈ లేఖను మీడియా సమక్షంలో విడుదల చేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచిందని అన్నారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు.ఈ మేరకు జగన్ లేఖలో గుర్తు చేశారు. ఈ 33 నెలల్లో రూ. 2 వేల చొప్పున ఒక్కో కుటుంబానికి రూ. 66 వేలు చెల్లించాల్సి ఉందన్నారు. ఏపీలో ఉన్న 1 కోటీ 75 లక్షల కుటుంబాలకు ఒక లక్షా 15 వేల కోట్ల మేర బకాయి పడ్డారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు బకాయిలతో పాటు నిరుద్యోగ భృతి మొత్తాన్ని చెల్లించేందుకు 2017-18 బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేదంటే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.