బెయిల్ వద్దు నన్ను జైళ్ళో వేయండి: మాజీ కోల్ సెక్రటరీ హెచ్ సీ గుప్తా
కోల్ స్కామ్ లో మాజీ కోల్ సెక్రటరీ హెచ్సీ గుప్తా పలు కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఆయన తన బెయిల్ను సరెండెర్ చేసేందుకు అనుమతించాలని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనను జైలులో వేయాలని కోరారు. తాను జైలు నుంచే విచారణకు హాజరవుతానని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసుకున్నారు. బెయిల్ కోసం సమర్పించిన బాండ్ను తనకు తిరిగి ఇచ్చేయాలని కోరారు.
కేసు విచారణ సందర్భంగా హెచ్ సీ గుప్తా తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. ‘నేను లాయర్లను భరించలేను. లాయర్ల ఖర్చులను చెల్లించలేను’ అని కోర్టుకు ఆయన విన్నవించుకున్నారు. గుప్తా విజ్ఞప్తిపై ప్రత్యేక న్యాయమూర్తి భరత్ పరాశర్ స్పందించారు. మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు. న్యూఢిల్లీ లీగల్ ఎయిడ్ సర్వీస్ అథారిటీకి చెందిన అడ్వకేట్ను గానీ.. అమెకస్ క్యూరీ సేవలను కానీ కల్పిస్తామని న్యాయస్థానం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనలను గుప్తా తోసిపుచ్చారు. ఈ కారణంగా.. గుప్తా దాఖలు చేసిన పిటిషన్పై ప్రతిస్పందన తెలియజేయాలని కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.