తమిళనాడు అసెంబ్లీలో అమ్మ చిత్రపటం ఆవిష్కరణ..!
తమిళనాడు లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంటే ఎంతగా ఆరాదిస్తారో.. అభిమానిస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆనారోగ్యంతో ఆమె అపోలో హాస్పిటల్ లో చేరి ఆ తర్వాత మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తమిళనాడు మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆ తర్వాత తమిళనాట రాజకీయాల్లో ఎన్నో మార్పులు చేర్పులు సంబవించాయి. గత కొంతకాలంగా తమిళనాడు అసెంబ్లీలో అమ్మ చిత్రపటాన్ని ఆవిష్కరించడానికి సన్నాహాలు జరిగాయి.
దీనిపై విపక్షాలు అభ్యంతరం చెప్పినా.. ముఖ్యమంత్రి పళని స్వామి మాత్రం తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జయలలిత భారీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. సీఎం ఈ పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సమక్షంలో అసెంబ్లీ స్పీకర్ పీ.ధనపాల్ సోమవారం జయలలిత చిత్రపటాన్ని ఆవిష్కరించారు. తమిళనాడు మాజీ సీఎంలు సీఎన్ అన్నాదురై, ఎంజీ రామచంద్రన్ సహా 10 మంది మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలతో పాటుగా జయలలిత భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.