బుల్లితెరనుంచి వెండి తెరకు జయతి
బుల్లితెరలో చాలా కాలం విజె (సాంగ్స్ను ప్రజెంట్ చేసే వాళ్లు)గా పనిచేసిన జయతి ఇప్పుడు వెండి తెరకు పరిచయం కాబోతున్నారు. జెమినీ టీవీలో దాదాపు 7 ఏళ్లకు పైగా పనిచేసిన జయతి నిర్మాతగా మారి సొంత బ్యానర్లో లచ్చి చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈశ్వర్ దర్శకత్వం వహించే ఈ సినిమా వివరాలను జయతి విలేకరులకు వెల్లడించారు. ఈ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయన్నరు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే చివరి వారంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
సినిమాలో ఉండే 24 శాఖలపై తనకు అవగాహన ఉందని అందుకే లచ్చి సినిమాను తీసినట్లు జయతి వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా కథకు ఎక్కడా అన్యాయం చేయకుండా చిత్రాన్నితీశామన్నారు. లచ్చి చిత్రంలో కామెడి, హారర్, థ్రిల్లర్ అన్నీ ఉంటాయన్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రం పొస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటోందని తెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.