బ్యాన్ విధించినప్పటికీ విదేశాలకు వెళ్ళిపోయిన జేసీ దివాకర్ రెడ్డి..
విశాఖ ఎయిర్ పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఇదికాస్తా వివాదంలా మారింది. అయితే జేసీ శుక్రవారం రాత్రి విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఇదికూడా చర్చనీయాంశంగా మారింది. పలు దేశీయ విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధించాయి.
అది జరిగిన ఒక్క రోజులోనే ఆయన విదేశాలకు వెళ్లిపోవడంపై ఆయన సోదరుడు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తన సోదరుడు ప్రతి ఏడాదిలాగానే ఇప్పుడు కూడా విదేశాలకు వెళ్లారని తెలిపారు. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. తాను కూడా వెళ్లాల్సి ఉందని.. కాని కొన్ని పనుల కారణంగా వెళ్లలేకపోయానని అన్నారు. ఈ నెల 15న విశాఖ ఎయిర్ పోర్ట్ లో తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించి అక్కడి సిబ్బందిపై జేసీ దివాకర్రెడ్డి దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.