2019 ఎన్నికలపై జేడీయూ టార్గెట్.. ప్రధాని అభ్యర్ధిగా నితీష్ కుమార్..?
ఈ మధ్యే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఇందులో మోదీ అన్నీ తానై నడిపించారు. ఇక యూపీ, ఉత్తరాఖండ్ లో బీజేపీ అద్వితీయ విజయాన్ని సాధించింది. ఇదిలాఉంటే బీజేపీ హవాను అడ్డుకోవడానికి పలు పార్టీలు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని భావిస్తున్నాయి. ఇక లౌకిక కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. అంతేకాకుండా ఆ కూటమి తరపున ప్రధాని అభ్యర్ధిగా నితీశ్ కుమార్ ను ఎంపిక చేయాలని భావిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయని సమాచారం.
ఇదిలాఉంటే లౌకిక కూటమికి ఆధ్వర్యం వహించాలని జేడీయూ భావిస్తోంది. దీనికి ఉదాహరణగా నితీష్ ని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నితీష్ పరిపాలనాదక్షుడని జేడీయూ అధికార ప్రతినిధి భారతీ మెహతా అన్నారు. నితీష్ కుమార్ కి దూరదృష్టి ఎక్కువని అన్నారు. సీఎంగా నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలతో బీహార్ లో మంచి మార్పులకు అవకాశం ఏర్పడిందని అన్నారు. అయితే ఇతర పార్టీలు నితీష్ కుమార్ ని ప్రధానిగా అభ్యర్ధిగా ఒప్పుకుంటాయా అన్నది వేచి చూడాల్సిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.