జ్యోతిలక్ష్మీ ఇకలేరు..
అలనాటి ప్రముఖ నటి జ్యోతిలక్ష్మి(53) కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఆమె స్వగృహంలో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. జ్యోతిలక్ష్మీ 300కు పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.
‘ఇదా లోకం’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘గండరగండడు’, ‘పిల్లాపిడుగా’, ‘గాంధర్వ కన్య’, ‘సీతారాములు’, ‘బెబ్బులి’, ‘బాబులుగాడి దెబ్బ’, ‘స్టేట్ రౌడీ’, ‘బిగ్బాస్’, ‘కలుసుకోవాలని’, ‘దొంగరాముడు అండ్ పార్టీ’, ‘బంగారు బాబు’ వంటి సినిమాల్లో నటించారు. జ్యోతిలక్ష్మీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం చిత్రాలతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. ఆమె మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలను నిర్వహించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.