వైసీపీకి జ్యోతుల నెహ్రూ రాజీనామా..
వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ పార్టీ జగన్ కు ఝలక్ ఇచ్చారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా మంగళవారం మధ్యాహ్నం ప్రకటించారు. అంతేకాదు.. పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖను కూడా పంపించారు. నెహ్రూ పార్టీకే కాకుండా ఇతర పదవులకు కూడా రాజీనామా చేశారు. జిల్లా అధ్యక్ష పదవితో పాటు పీఏసీ కమిటీ, రాష్ట్ర అధికార ప్రతినిధి పదవులకు కూడా గుడ్ బై చెప్పారు. తాను జగన్ ఆలోచనలకు అనుగుణంగా పార్టీలో ఇమడలేకపోతున్నానని తెలిపారు. అందుకే పార్టీని వీడుతున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు.
అయితే.. గత కొంతకాలంగా ఏపీలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు సైకిలెక్కేశారు. ఇక.. రీసెంట్ గా పీఏసీ నియామకంలో జగన్ తీరుపై జ్యోతుల నెహ్రూ అసంతృప్తిగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో ముమ్మర ప్రచారం సాగింది. తనను కాదని మరొకరిని నియమించడం వల్ల ఆయన తీవ్ర మనస్థాపానికి గురైనట్లుగా సమాచారం. అందువల్లే పార్టీ మారడానికి నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగింది. తాను టీడీపీలో చేరుతున్నట్లు జ్యోతుల నెహ్రూ సమీప బంధువైన వరుపుల సుబ్బారావు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.