మోడీని వందసార్లు కాల్చాలా?
ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దళితులపై దాడి చేయాలనుకుంటే తనపై తుపాకి దాడి చేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తనదైన శైలిలో స్పందించారు. ఎన్డీఏ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి దళితులపై చేసిన దాడులకు మోడీని వందసార్లు షూట్ చేసినా చాలదన్నారు. దళితులపై మోడీది కపటప్రేమ అని పేర్కొంటూ అందుకే ఒక్కసారి కాదు వందసార్లు తుపాకులతో కాల్చాలని ఆయన మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో మోడీకి దళితులు గుర్తుకు వచ్చినట్లున్నారని విమర్శించారు. ఒక్క నారాయణే కాదు.. కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా మోడీపై విమర్శల దాడికి దిగుతున్నారు.
మోడీ దళితుల వ్యతిరేకి అని మండిపడుతున్నారు. మోడీ అధికారంలోకి వచ్చాకే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. దళితుల కులవృత్తులు చేసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రధాన మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, ఆ సమస్యను పట్టించుకోకుండా దళితుల సింపతి కోసం తనను కాల్చమని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇవి మోడీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అంటున్నారు. ఏది ఏమైనా అటు నారాయణ, ఇటు కాంగ్రెస్ నాయకులు మోడీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.