విద్యాపరంగా మొదటి ప్లేస్ లో వరంగల్ జిల్లా: కడియం శ్రీహరి
వరంగల్ జిల్లాను విద్యాపరంగా స్టేట్ లోనే ఫస్ట్ ప్లేస్ లో నిలిపేందుకు అధికారులు అందరూ కృషి చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపు నిచ్చారు. హన్మకొండలో రెండురోజుల పాటు నిర్వహించే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ భేటీకి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు జిల్లా కలెక్టర్, జడ్పీ ఛైర్మన్, ఎంపీ దయాకర్, జడ్పీటీసీలు, ఎంపీటీసీ హాజరయ్యారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై వీరి భేటీలో చర్చించారు. వేసవికాలంలో తాగునీటి అవసరాలు, గ్రామాల్లో నీటి ఎద్దడి, కరవును ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు. తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కడియం సూచించారు.వరంగల్ జిల్లాలో అక్షరాస్యత తక్కువగా ఉందన్నారు. దీన్ని అధిగమించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.