కన్నయ్యను ప్రచారానికి వాడేసుకుంటున్న కాంగ్రెస్
అసోంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హస్తం పార్టీ సరికొత్తగా ప్రచారం చేస్తోంది. దేశంలో ఇటీవల దుమారం రేపిన ఘటనలను ఆ పార్టీ తెరమీదకు తెస్తోంది. ఇందులో భాగంగా జెఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యను పోస్టర్లకు ఎక్కించింది. కన్నయ్య కుమార్ ను అసోంలో కాంగ్రెస్ ఎన్నికల పోస్టర్ లో చూపిస్తోంది. సీపీఐ అనుబంధ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ నాయకుడైన కన్నయ్యను హస్తం నేతలు.. తమ ఎన్నికల ప్రచారానికి వాడేసుకుంటున్నారు.కొన్ని రోజుల్లో అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కన్నయ్య ఉన్న భారీ పోస్టర్లు, బ్యానర్లను అసోంలో ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. అంతేకాదు హెచ్సీయూలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ను కూడా కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారానికి వాడసుకుంటున్నారు. వారి ఇద్దరి ఫోటోలు ఉన్న పోస్టర్లే అసోంలో ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి.
మరోవైపు అసోంలో ఆరు పార్టీలతో కూడి వామపక్షాల కూటమి సయితం కన్నయ్యతో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ప్లాన్ చేసింది. యునైటెడ్ లెఫ్ట్ ఫోరం తరఫున అసోంతోపాటు పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ర్టాల్లో కన్నయ్య ప్రచారం చేపట్టనున్నారు. మొత్తం మీద ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు జేఎన్యూ, హెచ్సీయూ ఘటనలు కీలకంగా మారాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.