చేనేత కార్మికుల సమస్యలపై కేసీఆర్ దృష్టి..
తెలంగాణలో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. చేనేత మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికుల స్థితి గతులు బాగాలేవని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నల బాధలను తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
చేనేత కార్మికులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు. ఇందులోభాగంగా చేనేతలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రయత్నాలు చేపట్టమన్నారు. దీనికోసం సిరిసిల్ల చేనేత కార్మికులతో సమావేశం కావాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో చేనేతలు పడుతున్న అవస్థలు తెలుసుకోవాలన్నారు. చేనేతలకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందించాలని నిర్ణయించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.