అపర భగీరథుడు కేసీఆర్!
తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడు అని తెలంగాణ ప్రజలు కీర్తిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోస్తాలో బ్యారెజ్లు కట్టి రైతులను నీళ్లు అందించిన సర్ ఆర్థర్ కాటన్ ను అక్కడి ప్రజలు నేటికీ దేవుడిగాలా కొలుస్తుంటే ఇక్కడ కూడా కేసీఆర్ ను అంతకంటే ఎక్కువగా దేవుని లెక్క చూసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్లో తెలంగాణలో కరువు లేకుండా చేయడానికి కేసీఆర్ ఇటీవల మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకోవడం కానీ.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ తీసుకుంటున్న శ్రద్ధ కానీ చూస్తుంటే మాత్రం తెలంగాణకు మంచిరోజులు వస్తున్నాయని తెలుస్తోంది.
దశాబ్దాల తరబడి పెండింగ్లో కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కన్నెపల్లి గ్రామంలో కాళే శ్వరం పంపుహౌజ్కు( బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టు), అదే జిల్లా, అదే మండలంలోని అంబటిపల్లి గ్రామంలో మేడిగడ్డ బ్యారేజి నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ భూమిపూజ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఏడు జిల్లాలోని 18.19 లక్షల ఎకరాలకు సాగునీరందటంతో పాటు 11.80 లక్షల ఎకరాల స్ధిరీకరణ సాధ్యమవుతుంది. రైతును రాజుగా చేయాలని కేసీఆర్ చేసే ఈ ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు సైతం మెచ్చుకోక తప్పడం లేదు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.