ఆ గ్రామాలు తిరిగి తెలంగాణలో కలుపుతారట..
పోలవరం కోసం తీసుకున్న కొన్ని గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. దీనికోసం తాము ఏపీ ప్రభుత్వంతో మాట్లాడామని చెప్పారు. ఆయన ఈ విషయాన్ని శాసనమండలిలో ప్రకటించారు. ఈ అంశంలో మళ్ళీ ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని అన్నారు.ఇక తెలంగాణలో త్వరలోనే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు.
అన్ని ప్రాజెక్టులు పూర్తైన తర్వాత కోటి ఎకరాలకు నీటిని అందిస్తామని చెప్పారు. తెలంగాణ 21 శాతం వృద్ధి రేటుతో ముందుందని అన్నారు. తెలంగాణపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెద్దగా పడలేదని చెప్పారు. ఇక ఐటీ ఎగుమతులు 75 వేల కోట్ల మేర దాటాయని చెప్పారు. రాష్ట్రంలో మానవ వనరులు అత్యధికంగా ఉన్నాయని చెప్పారు. ఇదే రాష్ట్రానికి మంచి సంపద అని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.