ఈవీఎం ట్యాంపరింగ్ పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..
పంజాబ్ లో ఆప్ పార్టీ ఓటమికి కారణం ఈవీఎంల ట్యాంపరింగ్ అని మరోసారి ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అని తమకు అనుకూలంగా వచ్చాయని గుర్తు చేశారు.ఇక తన వాదనను ఆయన ఈసీకి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.ట్యాంపరింగ్ అంశాన్ని ఈసీకి వెల్లడించామని చెప్పారు.
అసలు దేశంలో ఎన్నికల ప్రక్రియ సజావుగానే సాగుతోందా అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు.ఈవీఎం మిషన్ లోని సాఫ్ట్వేర్ మార్పు వల్ల ఓటర్లు ఏ బటన్ నొక్కినా అన్ని ఓట్లు బీజేపీకి వెళ్తున్నాయని అన్నారు. ఇక ట్యాంపరింగ్ ఆరోపణల్లో నిజం లేదని ఈసీ వాదనను ఆయ ఖండించారు.
ప్రతి మిషన్ను ఈసీ చెక్ చేస్తోందా అంటూ ప్రశ్నించారు. తాను ఐఐటీ నుంచి వచ్చానని అన్నారు. అందువల్ల సాంకేతిక అంశాలపై తనకు నాలెడ్జ్ ఉందన్నారు. మిషన్లకు బీజేపీ, కాంగ్రెస్ ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. తమ ఓటమి హార్డ్ వేర్ సమస్య వల్ల లేక సాఫ్ట్ వేర్ సమస్యల వల్లా అన్ని తెలియాలని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.