మరో ఏడాది పాటు మాత్రమే గవర్నర్ గా ఉంటా: కిరణ్ బేడీ
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన గవర్నర్ గిరిపై మాట్లాడారు. తాను మరో ఏడాది మాత్రమే గవర్నర్ గా ఉంటానని తెలిపారు. తన హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నానని అన్నారు. ఈ విషయంలో తనకున్న అనుభవాన్ని రాష్ట్ర అధికారులు ఉపయోగించుకోవాలని అన్నారు.
రాజ్ భవన్ లో పలు అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు.ఈ నేపథ్యంలో ఆమె అధికారులతో మాట్లాడారు.ఈ సందర్భంగా కిరణ్ బేడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉంటే కిరణ్ బేడీని బదిలీ చేయాలంటూ అధికార కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల విధులను ఆమె అడ్డుకుంటున్నారని ఆరోపిస్తోంది. తమకు సమాంతరంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూకాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.