టీడీపీ ఎమ్మెల్యేల సస్పెషన్ పై కిషన్ రెడ్డి ఫైర్..
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కీలక పరిణమం చోటు చేసుకుంది. శాసన సభ నుంచి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను సస్పెండ్ చేశారు. ఈ అంశంపై బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ అనుమతి లేకుండా ప్రజా ప్రతినిధులను సస్పెండ్ చేసే అధికారం సభకు లేదన్నారు. ఈ విషయంలో తక్షణం స్పీకర్ తన వైఖరి చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
ప్రజలు వేసిన ఓట్లతో అధికారంలోకి వచ్చామని అన్నారు. ఏ విపక్ష పార్టీ కూడా సీఎం చెప్పిన విధంగా పనిచేయదని స్పష్టం చేశారు. తమకు ప్రసంగం నచ్చనప్పుడు నిరసన తెలిపే అధికారం ఉంటుందని అన్నారు. స్పీకర్ సభ నిర్వహణలో గత సంప్రదాయాలను పాటించాలని సూచించారు. అలాగే వచ్చే సంవత్సరాల్లో జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.