మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం కాదు: కిషన్ రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గిరిజనుల విషయంలో కేసీఆర్ కి చిత్తశుద్ధి లేదని అన్నారు. ముస్లీం రిజర్వేషన్లతో పాటు ఎస్టీ రిజర్వేషన్ బిల్లును కలిపి ప్రవేశపెడతామని ప్రభుత్వం చెబుతోందని అన్నారు. దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ముస్లీంల ఓట్ల కోసమే ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని అన్నారు. అంతేతప్ప ఎస్సీ రిజర్వేషన్ ల పట్ట కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
ఒకవేళ చిత్తశుద్ధి ఉండిఉంటే రెండింటిని వేర్వేరుగా బిల్లులుగా తీసుకొచ్చేదని అన్నారు. అలాకాకుండా ఒకే బిల్లుగా అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం కాదని అన్నారు. తాము ఈ అంశంలో హై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కోర్టు వీటిని కొట్టివేస్తుందని అన్నారు. అలా జరిగితే ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.