టీ యాప్ ఫోలియో ద్వారా 1000 సర్వీసులు: మంత్రి కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ టీ యాప్ ఫోలియోను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ లో మొబైల్ గవర్నెన్స్ లో తెలంగాణ సెకెండ్ ప్లేస్ లో ఉందన్నారు. టీ యాప్ ఫోలియోలో 150 ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మీ సేవ ప్రాంచైజీలు నష్ట పోకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. 86 ఏళ్ల తర్వాత రెవెన్యూ రికార్డుల తమ ప్రభుత్వం అప్డేషన్ చేసిందని చెప్పారు. ఫోన్లు లేని కాలంలో చాలా ఇబ్బంది ఎక్కువగా ఉండేదన్నారు. కాని ప్రస్తుతం టెక్నాలజీని ఇండియన్లు బాగా అలవాటు చేసుకున్నారని చెప్పారు. టీ యాప్ ఫోలియో ద్వారా భవిష్యత్లో 1000 సర్వీసులు అందిస్తామన్నారు.
ఈ ఏడాది చివరి నాటికి టీ ఫైబర్ ను కూడా పూర్తి చేస్తామన్నారు. గ్రామాలకు, తండాలకు కూడా టీ ఫైబర్ ను అందిస్తామన్నారు. టీ ఫైబర్ ద్వారా నేరుగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. రైతు ప్రాంగణాలకు కూడా ఫైబర్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.