పోలవరం వివరాలు ఇవ్వండి.. కేంద్రమంత్రికి కేవీపీ లేఖ..
పోలవరం ప్రాజెక్టుపై మరోసారి కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు స్పందించారు. ఈ అంశాన్ని ఆయన ఇటీవలె పార్లమెంటులో కూడా లేవనెత్తిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కేంద్రమంత్రి ఉమాభారతికి ఓ లేఖ రాశారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు. పోలవరం విషయంలో ప్రజలకు జనానికి కొన్ని అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న అనుమతులు గురించి తెలియజేయాలని కోరారు. ప్రాజెక్టు ప్రారంభం దగ్గర నుంచి ఇప్పటివరకు ఇచ్చిన అనుమతులను తేదీల వారీగా ఇవ్వాలని కోరారు.
అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వివరాలు కూడా ఇవ్వాలని కోరారు.ఏప్రిల్ 2014 నుంచి 2 జూన్ 2014 వరకు.. ఆ తర్వాత 2 జూన్ నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన రుణాలు, కేంద్రం గ్రాంట్ల వివరాలు తెలియజేయాలని కేంద్రమంత్రిని కోరారు.అలాగే ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఏపీలో పోలవరం ప్రాజెక్టు బాధితుల కోసం చేపట్టిన పునరావాస కార్యక్రమాలను కూడా తెలియజేయాలని కోరారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.