సెలెక్టర్లపై లోథా కమిటీ ఆరోపణలు..?
బీసీసీఐ ప్రక్షాళన కోసం ఏర్పాటైన జస్టీస్ లోథా కమిటీ.. ఏకంగా సెలెక్టర్లపైనే ఆరోపణలు ఎక్కుపెట్టింది. ఆటగాళ్ళను జట్టులోకి ఎంపిక చేయాలంటే లైంగిక వాంఛ తీర్చాలని సెలెక్టర్లు కోరుతున్నారని లోథా కమిటీ కార్యదర్శి గోపాల్ శంకర నారాయణన్ ఆరోపణలు చేశారు. ఈయన చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నెల 9న లోథా ప్యానెల్ తో జరిగిన భేటీలో నారాయణన్ సెలెక్టర్లపై ఆరోపణలు చేశారని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపారు. అంతేకాకుండా సెలెక్లర్లు చేస్తున్న నిర్వాకంపై బీసీసీఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కూడా ఆరోపించారని తెలిపారు. ఈ విషయాన్ని షిర్కే.. బీసీసీఐ ప్రెసిడెంట్ అనురాగ్ ఠాగూర్ కి మెయిల్ ద్వారా చెప్పారు.
9న జరిగిన మీటింగ్ కి అనురాగ్ ఠాగూర్ హాజరుకాలేదు. దీంతో బోర్డు తరపున కార్యదర్శి అయిన అజయ్ షిర్కే ఒక్కరే హాజరయ్యారు. ఈ భేటీకి సంబంధించిన పాయింట్లను షిర్కే బీసీసీఐ అధ్యక్షుడికి పంపించారు.’ఔత్సాహిక యువ ఆటగాళ్లను సెలెక్ట్ చేయాలంటే వారి తల్లులను తమ లైంగిక వాంఛ తీర్చాలని సెలెక్టర్లు కోరుతున్నారు. వారు అనైతిక, అక్రమాలకు పాల్పడుతున్నా బీసీసీఐ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సెలెక్టర్లు తప్పు చేస్తున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడం లేదు’ అని శంకర నారాయణన్ చెప్పినట్టు షిర్కే మెయిల్లో వివరించారు.
తాను నారాయణన్ చేసిన ఆరోపణలను ఖండించానని షిర్కే తెలిపారు. బీసీసీఐ హిస్టరీలో ఇలాంటివి జరిగినట్టు ఎప్పుడూ తమ దృష్టికి రాలేదని నారాయణన్తో చెప్పానన్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు శంకర్ నారాయణన్ నిరాకరించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.