ఎన్నికల కోసమే వారసత్వ ఉద్యోగాల ఎత్తుగడ: మల్లు భట్టివిక్రమార్క
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎన్నికల కోసం ఇప్పటినుంచే ఆలోచిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకే వారసత్వ ఉద్యోగాలను తెర మీదకు తెచ్చారని ఆరోపించారు. ఇలాంటి వాటిని జనం నమ్మరని అన్నారు.
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు పైపైన మాత్రమే అంగీకరించారని అన్నారు. కాని న్యాయస్థానం ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చేసే అక్రమాలను అసెంబ్లీలో ఎండగడతామన్నారు. త్వరలోనే ఆయనకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజలకు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.