
అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన సినిమా మనం. విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఏయన్నార్ చివరి సినిమాగా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఇక ఈమధ్యనే ప్రకటించిన ఏపి నంది అవార్డుల్లో ఈ సినిమాకు అవమానం కలిగిందని అన్నారు. అయితే ఈ సినిమా నంది అవార్డ్ రాకపోవడంపై స్పందించాడు నాగార్జున. ప్రేక్షకు హృదయాలను గెలుచుకున్న మనం అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకమని.. ఈ సినిమా తమకు ఆస్కార్ కన్నా ఎక్కువే అని అన్నారు.
ఓరకంగా నంది అవార్డుల మీద తన అసంతృప్తిని బయటపెట్టినా విమర్శగా కాకుండా తమ సినిమా ప్రేక్షకులు మనసులను గెలిచిన సినిమా అంటూ నాగార్జున మాట్లాడటం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా 2014లో సంచలన విజయం అందుకుంది. ప్రస్తుతం అఖిల్ హలో సినిమా ఈ నెల 22న రిలీజ్ అవుతుండగా ఆ సినిమా ప్రమోషన్స్ లో నాగార్జున నంది అవార్డులపై స్పందించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.