జగన్ ది సైకో మెంటాలిటీ.. అందుకే మాటిమాటికి విమర్శలు: ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ది సైకో మెంటాలిటీ అని విమర్శించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో అన్నారు. జగన్ ది సైకో మెంటాలిటి అని అందువల్లే ఏపీ సర్కారుపై మాటిమాటికి విమర్శలు చేస్తూంటారని అన్నారు. ఆరోపణలు చేయడం జగన్ కి అలవాటుగా మారిపోయిందని అన్నారు.
జగన్ కి ధైర్యం ఉంటే పులివెందుల సీటు ఖాళీ చేయాలని అన్నారు. అలా అయితే తమ యువనేత నారా లోకేష్ అక్కడ పోటీ చేసి గెలుస్తారని అన్నారు. నారా లోకేష్ గురించి చెప్పందుకు జబర్ధస్త్ కామెటీ షో కూడా చాలదని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుద్ధా వెంకన్న రోజా కామెంట్లపై రివర్స్ కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో జబర్ధస్త్ షో చేయించడం కోసమే రోజాను వైసీపీ అధినేత జగన్ పంపిస్తున్నారని సెటైర్లే వేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.