వారణాసిలో రోడ్ షో నిర్వహించిన ప్రధాని మోదీ..
భారత ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో శనివారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆయన బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి తన రోడ్ షో ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పండిట్ మదన్ మోహన్ మాలవీయ విగ్రహానికి పూలమాల వేశారు. ఆయనకు నివాళులర్పించిన తర్వాత రోడ్ షో ప్రారంభించారు.
ఇక రోడ్ షో సందర్భంగా ఆ ప్రాంతమంతా కాషాయం రంగులోకి మారిపోయింది. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. అలాగే రోడ్ షో మధ్యలో కాశీ విశ్వనాధుడికి ప్రత్యేక పూజలు చేశారు. కాశీ విశ్వేశ్వరుడికి హారతి ఇచ్చారు. ఇదిలాఉండగా అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ కూడా రోడ్ షో నిర్వహించారు. ఇద్దరు కలిసి పర్యటించారు. యూపీలో ఈ నెల 8న చివరి దశ పోలింగ్ జరగనుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.