మోదీ ప్రసంగాన్ని లైవ్ ఇచ్చేది లేదు: వెస్ట్ బెంగాల్ మినిస్టర్..
షికాగోలోని ప్రపంచ మత మహాసభల్లో స్వామి వివేకానంద ప్రసంగించి సెప్టెంబర్ 11 నాటికి 25 ఏళ్లు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు. ఇక ఈ స్పీచ్ ని లైవ్ ద్వారా అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో చూపించాలని యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే వెస్ట్ బెంగాల్ మినిస్టర్ పార్ధ ఛటర్జీ మాత్రం ససేమిరా అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి ప్రసంగాలను లైవ్ ఇవ్వలేమని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇక యూజీసీ ఆదేశాలపై పలు యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. అయితే యూజీసీ నిర్ణయాలను ఖచ్చితంగా అమలు చేయాలనే రూల్ ఏం లేదని మంత్రి వర్యులు వారికి చెప్పిపంపుతున్నారు. గతంలో కూడా ఇలగే మోదీ ప్రసంగాలపై ఆ రాష్ట్రంలో నిషేధం విధించింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.