ఏపీకి అన్యాయం జరగనివ్వబోం: సుజనా చౌదరి
బడ్జెట్లో దీర్ఘకాలిక జీవనాభివృద్ధిపై దృష్టి సారించారని కేంద్రమంత్రి సుజనాచౌదరి అన్నారు. అరుణ్ జైట్లీ తన బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేశారని అన్నారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. అలాగే బడుగు బలహీన వర్గాలకు కూడా ప్రోత్సాహం అందించారని అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పించారని పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలకు వెసులుబాటు కల్పించారని సుజనా అన్నారు. రెండంకెల అభివృద్ధి సాధించేందుకు ఈ బడ్జెట్ ఆరంభంగా పనికివస్తుందన్నారు. ఏపీకి మాత్రం ఎలాంటి నష్టం జరగనివ్వబోమని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు. ఏపీ విషయంలో కేంద్రంతో పోరాడుతూనే ఉంటామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు రావల్సిన అన్ని రకాల నిధులను కేంద్రం నుంచి వచ్చేలా చూస్తామన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.