కాపు రిజర్వేషన్లపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: ముద్రగడ పద్మనాభం..
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల 7వ తేదీ లోపు మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ఒకవేళ సీఎం నుంచి స్పందన రాకపోతే అదే రోజు కాపు జేఏసీ నేతలతో సమావేశం అవుతామని చెప్పారు. అదే రోజు నుంచి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు.
కాపు రిజర్వేషన్లపై ఏపీ సీఎం చంద్రబాబు చర్చలకు ఆహ్వనించాలని కోరారు. అలా అయితే తమ వైపు నుంచి ఐదుగురిని చర్చలకు పంపిస్తామని చెప్పారు. కాపు ఉద్యమాన్ని అణచి వేయడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కాపులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్న విషయాన్ని ఈ సందర్భంగా ముద్రగడ గుర్తు చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.