పవన్ బతిమాలాడాల్సిన పనిలేదు: ముద్రగడ పద్మనాభం
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత సినీ నటుడు పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ ఏనాడు కాపు ఉద్యమానికి సహకారం అందించలేదని విమర్శించారు. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లాలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. పవన్ లాంటి వ్యక్తులను బతిమాలాడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని అన్నారు. గతంలో ఈ విషయంలో తాము పవన్ కు ఆహ్వానం అందించామని చెప్పారు.
అయితే ఆహ్వానం పంపినా కూడా పవన్ కల్యాణ్ స్పందించలేదని అన్నారు. అలాంటి వ్యక్తులు రాకపోయినంత మాత్రాన తమ ఉద్యమానికి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. పవన్ రాకపోయినంత మాత్రాన కాపు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. బొట్టు పెట్టి మరీ పిలిచేందుకు ఇదేమీ పెళ్లి కాదని అన్నారు.కాపులకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. పనిలో పనిగా బోండా ఉమాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు మంత్రి ఇవ్వకపోవడంతో ఆయనకు కాపులు గుర్తుకువచ్చారా అంటూ ప్రశ్నించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.