‘ఎవరే ప్రేమను మాయంది..’
అక్కినేని నాగ చైతన్య ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూవీ “ప్రేమమ్”. ఈ సినిమాలో చైతూతో అందాల తారలు శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ రొమాన్స్ చేస్తున్నారు. చందూ మొండేటి దర్వకత్వం వహించారు. సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీలోని ‘ఎవరే ప్రేమను మాయంది..’ అనే పాటను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో నాగ చైతన్య సినిమా గురించి వివరించారు.
తన మనుసుకి బాగా దగ్గరగా ‘ప్రేమమ్’ సినిమా ఉందని అన్నారు. కథ విన్నవెంటనే ఒకే చెప్పానని తెలిపారు. ప్రేక్షకులను కథ, కథనాలు తప్పకుండా ఆకట్టుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. తమ సినిమాలో మ్యూజిక్ కి మంచి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ‘ఎవరే ప్రేమను మాయంది..’ గీతాన్ని శ్రీమణి రాశారని చెప్పారు. ఈ పాటను విజయ్ ఏసుదాస్ అత్యద్భుతంగా ఆలపించారని అన్నారు. వచ్చే నెలలో ‘ప్రేమమ్’విడుదల అవుతుందన్నారు. చైతూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మూవీకి గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.