నమామి బ్రహ్మపుత్ర వేడుకలను ప్రారంభించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నమామి బ్రహ్మపుత్ర వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేడుకలను ప్రారంభించారు. గౌహతిలోని ఓ ఘాట్ దగ్గర జ్యోలి ప్రజ్వలన చేశారు.ఈ కార్యక్రమానికి భూటాన్ ప్రధాని టోబ్గే కూడా హాజరయ్యారు. అలాగే అసోం రాష్ట్ర గవర్నర్ , సీఎం కూడా పాల్గొన్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. నమామి బ్రహ్మపుత్ర వేడుకలు వచ్చే నెల 4వరకు జరగనున్నాయి.
ఇక అధికారులు ఐదు రోజుల పాటు సాగే వేడుకలకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక అసోం రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సంగీతం గురించి తెలిసే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే అసోం ప్రజల ఆహారపు వ్యవహారాలు, టూరిస్ట్ ప్రాంతాలను ప్రతిబింబిచేలా పలు ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో వేడుకలకు వచ్చిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.