వచ్చే నెలలో దాయాది దేశాల ప్రధానుల భేటీ..?
భారత్, పాకిస్థాన్ ప్రధానులు నరేంద్రమోదీ, నవాజ్ షరీఫ్ మార్చి నెలలో సమావేశం కానున్నారని సమాచారం. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగే అణు సదస్సుకు ఇద్దరు ప్రధానులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సమావేశమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధ్యక్షతన మార్చి 31న ఈ భేటీ జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఇప్పటికే భారత్, పాక్ ప్రధానులకు ఆహ్వానం అందింది. దీంతో ఇరు దేశాల ప్రధానుల సమావేశం జరగ
డం దాదాపుగా ఖరారైనట్లేనని తెలుస్తోంది. 2010లో న్యూక్లియర్ సదస్సును ఒబామా ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి భారత్, పాక్ ప్రధానులు ఈ సదస్సుకు హాజరవడం ఇదే మొదటిసారి. మరోవైపు ఇటీవల జరిగిన పఠాన్కోట్ దాడుల నేపథ్యంలో దాయాది దేశాల ప్రధానుల భేటీపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే.. ఇద్దరు ప్రధానుల భేటీపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.