రిమోట్ కంట్రోల్ రాజకీయాలు వద్దు: మోడీ
అసోంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై ఘాటుగా స్పందించారు. గత పాలననుద్దేశించి వ్యంగ్యస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశం చాలా నష్టపోయిందని, ఆ పాలన అంతా రిమోట్ కంటోల్ నడిచిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఉద్దేశించి అన్నారు. అధికారం అంతా సోనియా గాంధీ చేతిలో పెట్టుకుని మన్మోహన్ సింగ్ను ఎలా కావాలంటే అలా ఆడిచ్చిందన్నారు. తన ప్రభుత్వం మాటలు చెప్పడం కంటే పని చేయడానికే ప్రాధాన్యత ఇచ్చిందని మాజీ ప్రధాని మన్మోహన్ అన్న మాటలకు ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ కాంగ్రెస్ పాలనలో జరిగినంత అవినీతి కుంభకోణాలు మునుపెన్నడూ జరగలేదని, ఆ కుంభకోణాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని కాంగ్రెస్పార్టీని ఎత్తిపొడిచారు.
అసోం సీఎం తరుణ్ గగోయ్పై కూడా ప్రధాని విమర్శలు గుప్పించారు. తరుణ్ గగోయ్ పాలన రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి చెందలేదన్నారు. ఇప్పుడు అలాంటి మనకు వద్దని ప్రజలనుద్దేశించి అన్నారు. గత పాలన గురించి మనకు అనవసరమన్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పూర్తి మెజార్టీతో గెలిపించాలని ప్రధాని ప్రజలను కోరారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.